ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మొరాయిస్తున్న ఈ-పాస్ యంత్రాలు... లబ్ధిదారులకు కష్టాలు - epass mechines

పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం పేదలకు అందని ద్రాక్షగా మారుతోంది. కడప జిల్లా రాజంపేటలో కొన్ని చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు పని చేయడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

shouting-e-pass-machines-dot-dot-dot-beneficiaries-are-hard
ఈ పాస్ యంత్రాలతో లబ్ధిదారుల కష్టాలు

By

Published : Mar 31, 2020, 8:53 PM IST

ఈ పాస్ యంత్రాలతో లబ్ధిదారుల కష్టాలు

కడప జిల్లా రాజంపేటలో పలు చౌక ధరల దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు పని చేయకపోవడంతో ప్రజలు మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని బండ్రాళ్ళవీధి, ఎర్రబల్లి, బంగ్లా వీధి తదితర ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు మొరాయించాయి. చౌకధరల సరకుల కోసం ప్రజలు ఉదయం ఆరు గంటల నుంచే దుకాణాల వద్ద బారులు తీరారు. అయితే యంత్రాలు పని చేయనందున చేసేదేమీ లేక వెనుతిరుగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details