శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా..కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయంలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి... 10 గంటల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కోవిడ్ దృష్ట్యా భక్తులకు అనుమతి లేకపోగా..తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు, ఉద్యోగులు....... ఏకాంతంగా రాములవారి కల్యాణం నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు........ రాజేశ్ ఆద్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణం జరిగింది. కోవిడ్ ప్రభావంతో రెండో ఏడాది కూడా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణాన్ని పండితులు ఏకాంతంగానే నిర్వహించారు.
సీతారాముల కల్యాణ మహోత్సవానికి......... ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు,....... ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ క్రతువుకు ముందుగా....... ఆలయంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలతో సీతారాములను అందంగా అలంకరించారు. పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో......... కల్యాణ వేదికను తీర్చిదిద్దారు. ఆలయం విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోయింది. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ క్రతువు సాగింది.