ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ - కడపలో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్

ఒంటిమిట్ట కోదండరాముడిని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ దర్శించుకున్నారు. ఉదయం అభిషేక పూజలో పాల్గొన్నారు. కాసేపట్లో కడప కలెక్టరేట్‌కు చేరుకోనున్న నిమ్మగడ్డ.. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

SEC visiting Ontimitta
SEC visiting Ontimitta

By

Published : Jan 30, 2021, 10:03 AM IST

రాయలసీమ పర్యటనలో ఉన్న ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని ఆలయాన్ని దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఒంటిమిట్ట చేరుకున్న రమేశ్‌కుమార్.. ఇవాళ ఉదయం స్వామివారి అభిషేక పూజల్లో పాల్గొన్నారు.

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ పండితులు స్వామివారి విశిష్టత ను రమేష్ కుమార్ కు తెలియజేశారు. ఇక్కడ నుంచి కడప కలెక్టరేట్‌కు చేరుకోనున్న ఆయన.. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details