ఆన్లైన్లో ఇసుక కావాలని బుక్ చేసుకుంటే మట్టి వచ్చింది. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది. కూచివారిపల్లె పంచాయతీ పరిధిలోని ఎస్వీ నగర్కు చెందిన నాగినేని చంద్రశేఖర్ అనే వ్యక్తి... ఇంటి నిర్మాణం కోసం 18 టన్నుల ఇసుక కావాలంటూ రూ.9,322 అన్లైన్లో డబ్బులు చెల్లించాడు. కిచ్చమాంబాపురం క్వారీ నుంచి అతనికి లోడు పంపారు. కానీ అందులో మట్టి ఇసుక ఉంది. గుర్తించిన చంద్రశేఖర్ బంధువు తమకు ఈ ఇసుక వద్దంటూ టిప్పర్ను వెనక్కి పంపించేశారు.
ఇసుక కావాలని బుక్చేస్తే మట్టిని పంపారు..!
తన ఇంటి నిర్మాణం కోసం కూచివారిపల్లె పంచాయతీ పరిధి ఎస్వీనగర్లో 18 టన్నుల ఇసుకను చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆన్లైన్లో బుక్ చేశారు. అతనికి కిచ్చమాంబాపురం క్వారీ నుంచి మట్టితో ఉన్న ఇసుకను పంపారు.
ఇసుకలో కల్తి