ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేశారు..!

సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. అంతలోనే ఏమైందో... ఎలా వచ్చిన ట్రాక్టర్లను అలాగే తిరిగి వెనక్కి పంపించారు.

By

Published : Jan 24, 2020, 7:35 PM IST

Updated : Jan 27, 2020, 9:30 AM IST

ఇసుక అక్రమ రవాణా
ఇసుక అక్రమ రవాణా

పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేశారు

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి సొంత నియోజకవర్గంలోని వేంపల్లి, కుమ్మరాంపల్లి, పాపాగ్ని ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. అక్కడకు చేరుకొని 11 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ ఏడీ బాలసుబ్రమణ్యం, ఆర్​ఐ, అధ్వర్యంలో ఆ ట్రాక్టర్లను వేంపల్లి ఠాణాకు తరలించారు.

అయితే ఏం జరిగిందో తెలియదు గానీ... ఎలా వచ్చిన ట్రాక్టర్లను అలాగే బయటకు పంపించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిని పట్టుకున్న అధికారులు మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న స్థానికులు రాజకీయ నాయకుల అండ చూసుకునే ఇసుక మాఫియా రెచ్చిపోతుందంటూ ఆరోపించారు.

Last Updated : Jan 27, 2020, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details