ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి - కడప జిల్లా నేర వార్తలు

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో విషాదం జరిగింది. శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి
డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి

By

Published : Dec 6, 2020, 6:39 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువుకు చెందిన ప్రదీప్, రాజగోపాల్ సమీప బంధువులు. రాజగోపాల్ చెల్లెలు వివాహం నిమిత్తం పెళ్లి పత్రికలు తీసుకొని ఇరువురు శనివారం రాత్రి గూడెంచెరువుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పాత బస్టాండ్ దాటిన తర్వాత ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఓ కుక్క అడ్డురావటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొంది.

ఈ ప్రమాదంలో ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందగా..రాజగోపాల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కడప రిమ్స్​కు తరలించినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ప్రదీప్ వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రదీప్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details