ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనం నుంచి జారిపడ్డ మహిళ.. దూసుకొచ్చిన మృత్యువు - యర్రగుంట్లలో రోడ్డు ప్రమాదాలు

కడపజిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి పెన్నా నది బ్రిడ్జ్ వద్ద ద్విచక్రవాహనం నుంచి మహిళ జారి పడింది. ఇంతలోనే తలపై నుంచి లారీ దూసుకెళ్లింది. మహిళ అక్కడికక్కడే మృతి చెందింది

road accident at yerra guntla
ద్విచక్ర వాహనం నుంచి జారిపడ్డ మహిళ.. దూసుకొచ్చిన మృత్యువు

By

Published : Oct 14, 2020, 2:09 PM IST

కడపజిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి పెన్నా నది బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న భార్గవి (35) అనే మహిళ.. జారిపడింది. వెంటనే ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది. అక్కడిక్కడే మహిళ మృతి చెందింది. ఈ ఘటనతో ట్రాఫిక్ రెండు కిలోమిటర్ల మేర నిలిచిపోయింది.

భార్గవి భర్త వంశీనాధ్ రెడ్డి ఆర్టీపీపీలో ఉద్యోగి. 8 నెలలు క్రితమే వారికి వివాహమైంది. మృతురాలి కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు మోడంపల్లెలో నివాసం ఉంటున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ట్రాఫిక్ రాకపోకలను క్రమబద్ధీకరించారు.

ABOUT THE AUTHOR

...view details