ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్రలేఖనం ద్వారా కరోనాపై ప్రజల్లో చైతన్యం - COVID-19

కరోనా వైరస్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా రాజంపేటలో చిత్రకారులు వైరస్ చిత్రాలు గీసి ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

Revival of people on Corona by painting in Rajampeta
రాజంపేటలో చిత్రలేఖనం ద్వారా కరోనాపై ప్రజల్లో చైతన్యం

By

Published : Mar 31, 2020, 6:49 PM IST

రాజంపేటలో చిత్రలేఖనం ద్వారా కరోనాపై ప్రజల్లో చైతన్యం

కరోనా నియంత్రణపై తమ వంతు బాధ్యతగా చిత్రలేఖనం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శిల్పి రాజాచారి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో పాతబస్టాండ్ కూడలి, ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో వైరస్ చిత్రాలు చిత్రించారు. 'కరోనా నియంత్రణలో మనమంతా భాగస్వాములం అవుదాం.. ఇంటి వద్దనే ఉందాం.. సామాజిక దూరాన్ని పాటిద్దాం.. పోలీసులకు సహకరిద్దాం' అంటూ నినాదాలు రాశారు. ఈ నినాదాలు అందర్నీ ఆకర్షించాయి.

ABOUT THE AUTHOR

...view details