కడప జిల్లా రాజంపేట మండలం అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువ కింద చివరి ఆయకట్టు చెరువులకు నీరు అందడం లేదంటూ అన్నదాతల ఆందోళనపై గత నెల ఒకటో తేదీన ఈటీవీ భారత్లో 'అందని నీళ్లు' అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై అధికారులు స్పందించి కాలువలోని అడ్డంకులను తొలగించారు. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు అందడానికి మార్గం సుగమమైంది. తమ సమస్యను వెలుగులోకి తెచ్చి, పరిష్కారానికి కృషి చేసిన ఈటీవీ భారత్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: రైతన్నల సమస్యలు పరిష్కరించిన అధికారులు - annamayya project
కడప జిల్లాలో ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. అన్నమయ్య ప్రధాన కాలువ చివరి ఆయకట్టు రైతుల సమస్యలపై గత నెల ఒకటో తేదీన ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.
![ఈటీవీ భారత్ ఎఫెక్ట్: రైతన్నల సమస్యలు పరిష్కరించిన అధికారులు removal-of-obstructions-in-main-canal-of-annamayya-reservoir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6264210-737-6264210-1583131253221.jpg)
అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువలో అడ్డంకుల తొలగింపు
అన్నమయ్య జలాశయం ప్రధాన కాలువలో అడ్డంకుల తొలగింపు