ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రాహ్మణపల్లె బీట్​లో రూ. 50లక్షలు విలువైన ఎర్రచందనం పట్టివేత - redsandle wood smugglers at kadapa news update

ఎర్రచందనం దుంగలను చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని కడప జిల్లా బద్వేలు అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లర్ నాగరాజుని అదుపులోకి తీసుకొని, 50లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు

redsandle wood
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

By

Published : Oct 23, 2020, 6:16 PM IST


కడప జిల్లా బద్వేల్ అటవీశాఖ రేంజ్​లోని బ్రాహ్మణపల్లె బీట్​లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం మేరకు బద్వేల్ రేంజర్ మధుబాబు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా ఏసీ వాహనానంతోపాటుగా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవరు పారిపోయేందుకు ప్రయత్నించగా అటవీ శాఖ సిబ్బంది చుట్టుముట్టి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పట్టుపడిన స్మగ్లర్ ప్రొద్దుటూరు మండలం పోట్లదుర్తి చెందిన నాగరాజుగా గుర్తించారు. గతంలో కూడా ఎర్రచందనం దుంగలు తరలించినట్లు నాగరాజుపై నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కేసులు నమోదైనట్లు మధు బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details