ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్‌

By

Published : Nov 19, 2020, 5:48 PM IST

ఎర్రచందనం స్మగ్లర్‌ చల్లాపూర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

Red sandalwood smuggler in police custody at kadapa district
పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్‌

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కన్నెగుంటలో మూడు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన చల్లాపుర్ అనే ఎర్రచందనం స్మగ్లర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ స్మగ్లర్​పై దాదాపు 10 కేసులు ఉన్నాయన్నారు. చెన్నైకి చెందిన వ్యక్తులకు ఎర్రచందనం సరఫరా చేస్తున్నాడనే...సమాచారంతో నిఘా ఉంచి అతన్ని అదుపులోకి తీసుకున్నామని...సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్ రావు తెలిపారు. స్మగ్లర్​ను పట్టుకునేందుకు రైల్వే కోడూర్ ఎస్సైలు పెద్ద ఓబన్న, సురేష్ నిఘా ఉంచి వీళ్లను పట్టుకున్నారని తెలిపారు. ప్రజలకు ఎర్రచందనం అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని వారు సూచించారు.

ఇదీ చదవండి:

ఆసరా, చేయూత కింద పాడి పశువుల పంపిణీ: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details