ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 6.50 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత - ఫించా సమీపంలో ఎర్రచందనం స్వాధీనం

పింఛా సమీపంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న 12 మందిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.6.50 లక్షల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

రూ. 6.50 లక్షల ఎర్రచందనం పట్టివేత
రూ. 6.50 లక్షల ఎర్రచందనం పట్టివేత

By

Published : Sep 29, 2020, 12:39 AM IST

కడప జిల్లాలోని సుండుపల్లి మండలం పింఛా సమీపంలో ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారంతా తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాకు చెందిన వారని అధికారి వీరయ్య తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.6.50 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. చట్టవ్యతిరేకంగా దుంగలను తరలించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details