ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేకోడూరు, రాయచోటిలో ఎర్రచందనం దుంగలు పట్టివేత - కడపలో ఎర్రచందనం దుంగలు పట్టివేత వార్తలు

కడప జిల్లాలోని రైల్వేకోడూరు, రాయచోటిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి... 27ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు.

red sandal seazed in railway kodur at kadapa district
రైల్వేకోడూరులో ఎర్రచందనం దుంగలు పట్టివేత

By

Published : Aug 14, 2020, 6:07 PM IST

కడప జిల్లా రైల్వేకోడూరు, రాయచోటిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. టాస్క్​ఫోర్స్ సిబ్బందికి అందిన సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

రాయచోటిలోని వన్నెమాండ్ల అటవీ ప్రాంతంలో 14 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరి కొంతమంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రైల్వే కోడూరు కెవి బావి ప్రాంతంలో 13 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు.

తిరుపతి శ్రీవారి మెట్టు సమీపంలో ఈతకుంట వద్ద ఎర్ర చందనం దుంగలు తీసుకువస్తున్న తమిళనాడుకు చెందిన స్మగ్లర్లను పట్టుకోవటానికి ప్రయత్నించగా... ఎర్రచందనం దుంగలను పడివేసి పారిపోయినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

మ‌న్యంలో కుండ‌పోత‌వ‌ర్షం... పొంగి పొర్లుతున్న వాగులు

ABOUT THE AUTHOR

...view details