12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు - red sadel seezed in obulavari palli kadapa district
కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం గాదెల అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ఇద్దరిని అటవీశాఖాధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి లక్ష రూపాయలు విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లింగ్కు పాల్పడగా.. మిగిలినవారు పరారయ్యారని అధికారులు తెలిపారు. వీరిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.