కడప జిల్లా బి. కోడూరు మండలం తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో రీ పోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ రెడ్డి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామ పంచాయతీలో కౌటింగ్ ప్రక్రియలో మోసం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
కౌటింగ్ అనంతరం ఆర్ఓ మొదట మధు రెడ్డి.. ఐదు ఓట్లతో గెలిచారని చెప్పారన్నారు. మరోసటి రోజు రామసుబ్బారెడ్డి 2 ఓట్లతో గెలిచారని చెప్పటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.