కొండాపురం మండల సమీపంలో కొర్రపాడు పునరావాస కాలనీవాసులు ఆందోళన నిర్వహించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరినా అధికారులు పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. శవాన్ని రోడ్డుపై ఉంచి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు.
శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరుతూ శవంతో నిరసన - Concern of Korrapadu resettlement colonists news
కడప జిల్లా కొండాపురం మండలం కొర్రపాడు పునరావాస కాలనీ ప్రజలు ఆందోళనకు దిగారు. కాలనీకి శ్మశాన స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ శవంతో ఆందోళన చేపట్టారు.
శవాన్ని రోడ్డుపై ఉంచి నిరసన
Last Updated : Jan 4, 2021, 3:19 PM IST