ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 21, 2020, 11:57 PM IST

ETV Bharat / state

'సీఎం తన స్వార్థం కోసమే రాజధాని మార్పు'

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని... పాలన రాజధానిగా విశాఖను మార్చటంపై కడప జనసేన పార్టీ ఇన్​ఛార్జ్, భాజపా జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి ఖండించారు.

"విశాఖను రాజధానిగా మార్చటం దారుణం'
"విశాఖను రాజధానిగా మార్చటం దారుణం'

"విశాఖకు రాజధానిని మార్చటం దారుణం'

సీఎం జగన్ తన స్వార్థం కోసమే... పాలన రాజధానిగా విశాఖను మార్చరాని కడప జనసేన పార్టీ ఇన్​ఛార్జ్ సుంకర శ్రీనివాస్, భాజపా జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి సంయుక్తంగా ఖండించారు. చంద్రబాబునాయుడు పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు....జగన్​కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. దీంతో ఆయన రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. 9 వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు జరిగాయన్న ఆయన ఇప్పుడు రాజధానిగా విశాఖను మార్చటం దారుణమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెబుతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details