ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 10:53 AM IST

ETV Bharat / state

కరోనా ఆర్థిక సహాయం పెంచాలని మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆరోపించారు. కరోనా ఆర్థిక సహాయం కింద ఇస్తోన్న వెయ్యి రూపాయలను రూ.5 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.

corona financial support should be increased
కరోనా ఆర్థిక సహయం రూ.5 వేలు ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి నిరాహార దీక్ష చేప‌ట్టారు. దిల్లీలో మాదిరిగానే రాష్ట్రంలోనూ క‌రోనా ఆర్థిక స‌హాయం కింద రూ.5 వేలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కరోనా వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ రూ.1000 ఆర్థిక స‌హాయం చేయడం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. కేంద్రం ఇచ్చిన స‌హాయాన్ని వైకాపా ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. మూడు రోజుల్లో క‌రోనా ఆర్థిక స‌హాయం పెంచ‌క‌పోతే మ‌ళ్లీ 48 గంట‌లు దీక్ష చేస్తాన‌ని ఆయన హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details