ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్మా ఇచ్చి కరోనా బాధితుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ - ఒంగోలులో కరోనా బాధితుడికి ప్లాస్మాను దానం చేసిన పోరుమామిళ్ల కానిస్టేబుల్

కరోనాతో బాధపడుతున్న బాధితునికి ప్లాస్మాను అందచేసి ప్రాణాలను కాపాడాడు కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన కానిస్టేబుల్ జయరామిరెడ్డి. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగికి ప్లాస్మా దానం చేసి పలువురి మన్ననలను పొందారు.

కరోనా బాధితుడికి ప్లాస్మా ఇచ్చి... ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
కరోనా బాధితుడికి ప్లాస్మా ఇచ్చి... ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

By

Published : Aug 5, 2020, 11:28 PM IST

కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగికి ఓ కానిస్టేబుల్ ప్లాస్మా దానం చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. పోలీసులలో కఠినత్వమే కాదు మానవత్వం కూడా ఉంటుందని ఆయన నిరూపించారు. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన కానిస్టేబుల్ జయరామిరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగికి ప్లాస్మా దానం చేసి ప్రాణం పోశారు. ఇతని ఉదారతను గుర్తించిన వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బంది అభినందించారు.

కరోనా బాధితుడికి ప్లాస్మా ఇచ్చి... ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details