ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 22, 2019, 3:23 PM IST

ETV Bharat / state

కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టివేత

కడప జిల్లా రాజంపేట, ప్రొద్దుటూరు అటవీ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్దఎత్తున ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనంస్మగ్లర్లు

కడపజిల్లాలో పెద్దఎత్తున ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లాలో అటవీ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.రాజంపేట అటవీ ప్రాంతంలో 5 ఎర్రచందనం దుంగలతోపాటు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. రోళ్లమడుగు జలకోన ప్రాంతంలో ముందస్తు సమాచారం మేరకు... తమిళనాడుకు చెందిన దొరై, శివ అనే వ్యక్తులను పట్టుకున్నామని అటవీశాఖ రేంజర్ నయీమ్ అలీ చెప్పారు. జిల్లాలోని ప్రొద్దుటూరు అటవీ డివిజన్ పరిధిలోని బలసింగాయపల్లె వద్ద అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధమైన.... 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులను చూసి... తమిళ కూలీలు పారిపోయారు. స్మగ్లర్లలో 24 మంది తప్పించుకోగా... ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దుంగల విలువ రూ. 3 లక్షలకు పైగా ఉంటుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details