ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 11, 2020, 8:25 AM IST

ETV Bharat / state

ప్రాణం నిలిపిన పోలీసులు!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు సకాలంలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్​లో గూడెంచెరువులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

police resuced a man at jammalamadugu
జమ్మలమడుగులో వ్యక్తిని కాపాడిన పోలీసులు



కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండ్​లో గూడెంచెరువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని స్థానికులు చూసినప్పటికీ ఆసుపత్రికి తరలించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ విషయం కానిస్టేబుళ్లకు తెలిసింది. వెంటనే ఒక ఆటోలో ఆ వ్యక్తిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో బాధితుడు సురేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు దంపతుల మధ్య ఘర్షణ కారణమని పోలీసులు తెలిపారు. గూడెం చెరువుకు చెందిన సురేష్ దంపతులు తరచూ గొడవ పడేవారని.. సోమవారం భార్య ...భర్త పై ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్​కు వెళ్లిందని అన్నారు. కేసు పెడుతుందోమోనని భయపడిని భర్త ..నెయిల్ పాలిష్ ద్రావణాన్ని తాగి ఆత్మహత్యకు యత్నించాడని వారు పేర్కొన్నారు. సకాలంలో స్పందించి బాధితుడిని కాపాడిన పోలీసులను పలువురు ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details