ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 1, 2021, 3:52 PM IST

ETV Bharat / state

గంజాయి ముఠా గుట్టు రట్టు.. పరారీలో ప్రధాన నిందితుడు

కడప జిల్లాలో గంజాయి అమ్ముతున్న ముఠాను పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ganja selling gang arrested at kadapa district
గంజాయి ముఠా గుట్టు రట్టు

కడప జిల్లా మైదుకూరులో ఆటోతో సహా ఎనిమిది కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి విశాఖపట్నం నుంచి గంజాయి తెప్పించి అనుచరుల ద్వారా విక్రయిస్తున్నట్లుగా డీఎస్పీ విజయకుమార్ తెలిపారు.

నిందితుల వివరాలు..

మైదకూరులో స్థిరపడిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నక్కలదిన్నెకు చెందిన వెంకటేశ్వర్లుతో పాటు సహనిందితులు భూమాయపల్లె వెంకటసుబ్బయ్య, అక్కమ్మ గారి చంద్ర, ఆటో చోదకుడు షేక్‌ షఫీలను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు పుల్లయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details