ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యం కొనలేక..మత్తు కోసం శానిటైజర్ తాగి వ్యక్తి మృతి

By

Published : Jul 1, 2020, 12:21 PM IST

మద్యం దొరక్క మత్తు కోసం రసాయనాలు తాగి మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. మందు ధరలు పెరగటంతో దాన్ని కొనలేక.. మత్తు కోసం శానిటైజర్ తాగి వ్యక్తి చనిపోయిన ఘటన కడప నగరంలో జరిగింది.

person died with drunk sanitizer in kadapa
శానిటైజర్ తాగి మృతిచెందిన పురుషోత్తం

మద్యానికి బానిసైన వ్యక్తి మత్తు కోసం శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన కడపలో జరిగింది. కడప రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న పురుషోత్తం కరెంట్ పనులు చేస్తుంటాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల మద్యం ధరలు భారీగా పెరగటంతో అతను కొనలేకపోయాడు. దాంతో మంగళవారం మత్తు కోసం శానిటైజర్ తాగాడు.

అస్వస్థతకు గురైన అతన్ని రిమ్స్​కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details