ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్లైనా తెరవకముందే కరోనాతో కవలల పోరాటం - pagency lady dead with corona two days back in kadapa

కడపజిల్లా చాపాడు మండలం ఖాదర్ పల్లికి చెందిన ఓ గర్భిణి కవల పిల్లలకు జన్మనిచ్చి చనిపోయింది. అనంతరం ఆమెకు పరీక్షచేయగా కరోనా వచ్చింది. పసి పిల్లలను రిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లిన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ ప్రత్యేక శ్రద్ధతో వైద్య చికిత్సలు అందించాలని రిమ్స్ వైద్యాధికారులను ఆదేశించారు.

కళ్లైనా తెరవకముందే కరోనాతో కవలల పోరాటం
కళ్లైనా తెరవకముందే కరోనాతో కవలల పోరాటం

By

Published : Jun 13, 2020, 4:13 AM IST

కళ్లైనా తెరవకముందే ఇద్దరు పసికందులు కరోనాతో పోరాడుతున్నారు. కడప జిల్లా చాపాడు మండలం ఖాదర్ పల్లికి చెందిన గర్భిణి 2 రోజుల క్రితం కవలలకు జన్మనిచ్చి కన్నుమూసింది. అనంతరం జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాటినుంచీ ఇద్దరు శిశువులను రిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ తరుణంలో రిమ్స్‌ను సందర్శించిన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ.. పిల్లలకు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలని వైద్యులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details