ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడే ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం...

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం నేడు సాధారణంగా జరగనుంది.కరోనా ప్రభావంతో ఒంటిమిట్ట కోదండరామస్వామి నవమి బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రాంగణానికే పరిమితమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారు మోహినిదేవి అలంకారంలో కొలువు తీరారు.

By

Published : Apr 7, 2020, 3:22 AM IST

Updated : Apr 7, 2020, 4:05 AM IST

ontimitta kodandarama swamy kalyanam
నేడే ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం

ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం సర్వసాధారణంగా నిర్వహించనున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి బ్రహ్మోత్సవం వేడుకలు నిరాడంబరంగా చేయనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఈరోజు(7)న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి వారి కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జరగనుంది. కల్యాణ వేడుకను తిలకించడానికి భక్తులను అనుమతించరు. ఈ క్రతువుని కనులారా వీక్షించేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. పరిమిత సంఖ్యలో స్వామివారి ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేశారు.

Last Updated : Apr 7, 2020, 4:05 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details