ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు ట్రిపుల్ ఐటీలో.. రెండో రోజుకి చేరిన విద్యార్థుల ధర్నా - ఒంగోలు ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ధర్నా

సమస్యల పరిష్కారం కోసం.. కడప జిల్లా వేంపల్లెలోని ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రెండో రోజూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 27న క్యాంపస్​కు వచ్చి మాట్లాడతానని ఛాన్సలర్ కేసీరెడ్డి ఫోన్​లో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. పీసీసీ అధ్యక్షులు తులసి రెడ్డి వెళ్లి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ongole iiit students protesting since two days
ఒంగోలు ట్రిపుల్ ఐటీలో రెండో రోజూ కొనసాగుతున్న విద్యార్థుల ధర్నా

By

Published : Mar 20, 2021, 9:33 PM IST

ధర్నా చేస్తున్న విద్యార్థులు

కడప జిల్లా వేంపల్లెలోని ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో.. విద్యార్థుల ధర్నా రెండోరోజూ కొనసాగుతోంది. సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల 27న క్యాంపస్​కు వస్తానని ఛాన్సలర్ కేసీ రెడ్డి ఫోన్లో మాట్లాడినా.. విద్యార్థులు వినిపించుకోవడం లేదు. సంస్థ డైరెక్టర్ జయరామిరెడ్డి, ఇతర అధికారులు, ఆర్కే వ్యాలీ పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

దాదాపు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించగా.. పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తులసి రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్ ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ధర్నా విరమించమని విద్యార్థులు భీష్మించుకుని కూర్చున్నారు. రాత్రి భోజనాలు చేయకుండా నిరసన తెలుపుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details