తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప పర్యటనకు అనుమతి లభించలేదు. కరోనా ఆంక్షల మేరకు జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్రెడ్డిని కలిసేందుకు అనుమతి ఇవ్వలేమని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం అనంతపురం వెళ్లి జేసీ కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించనున్నారు.
లోకేశ్ కడప పర్యటనకు అనుమతి నిరాకరణ
జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిసేందుకు సోమవారం కడప పర్యటనకు సిద్ధమైన లోకేశ్కు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన రేపు అనంతపురం వెళ్లి జేసీ కుటుంబసభ్యులను కలువనున్నారు.
nara lokesh kadapa tour