ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 4:21 PM IST

ETV Bharat / state

red sandalwood: దుండగులు పరార్... దుంగలు స్వాధీనం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో టాస్క్ పోర్స్ అధికారులు.. అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందన్నారు.

red sandalwood
ఎర్ర చందనం పట్టివేత

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కొండమ్మ బావి దగ్గర అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన ఎర్ర చందనం దుంగలు విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందన్నారు.

అనంతపురం రేంజ్​ డీఐజీ కాంతిరాణా టాటా ఆదేశాలతో అధికారులు కొండమ్మ బావి, దేశెట్టిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. కొండమ్మ బావి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఎర్ర చందనం దుంగలను మోసుకొస్తుండటాన్ని గమనించి... వారిపై దాడులు నిర్వహించారు. నిందితులు దుంగలను పడవేసి పారిపోయారని అధికారులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

బెట్టింగ్​ రాయళ్లపై దాడి.. 8 మంది అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details