ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైదకూరు ఎంపీడీవో కార్యాలయంలో పోషకాహార మాసోత్సవం

గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారంపై కడప జిల్లా మైదకూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషకాహార మాసోత్సవం సందర్భంగా సభలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

By

Published : Sep 13, 2019, 10:26 PM IST

అవగాహన కార్యక్రమం

కడప జిల్లా మైదుకూరు ఎంపీడీవో సభా భవనంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహార ఆవశ్యకతపై సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మల్లేష్ సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు పాలు, గుడ్లు విధిగా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సకాలంలో దొరికే పండ్లను తినాలన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీయకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు.

పోషకాహార ఆవశ్యకతపై సమావేశం

ABOUT THE AUTHOR

...view details