ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నివర్​ ఎఫెక్ట్​.. నేటికి తొలగని ఇబ్బందులు..

By

Published : Dec 14, 2020, 10:47 AM IST

నివర్ తుపాన్ కారణంగా వచ్చిన వరదకు కడప జిల్లాలోని బుగ్గవంక ప్రాజెక్ట్​పై ఉన్న రెండు కాజ్ వేలు పూర్తిగా పాడయ్యాయి. సిమెంట్ రోడ్డు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపించాలని కోరుతున్నారు.

nivar cyclone effect to Washed Cause finger
కొట్టుకుపోయిన కాజ్​వేలు

నివర్ తుపాన్ మిగిల్చిన నష్టం.. ఇప్పటికీ కళ్లెదుట కదలాడుతోంది. తుపాన్ కారణంగా కడప బుగ్గవంక వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అనంతరం కురిసిన వర్షాలకు బుగ్గవంక ప్రాజెక్ట్​కు భారీగా వరద చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహానికి బుగ్గవంక పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. బుగ్గవంకపై ఉన్న రెండు కాజ్ వేలు వరద ధాటికి తునాతునకలు అయ్యాయి. అక్కడ ఉన్న సిమెంట్ రోడ్డు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి రాళ్లు, పైపులు బయటకు కనిపిస్తున్నాయి. స్థానికులకు నడిచేందుకు అవకాశం లేని విధంగా మారింది. ఈ రెండు కాజ్ వేలు దెబ్బతినటంతో కడపలోని రవీంద్ర నగర్ వాసుల అగచాట్లు తప్పడం లేదు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details