ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు నేడు పనులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసంతృప్తి

పాఠశాలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని పతంగే రామన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

By

Published : Oct 24, 2020, 4:56 PM IST

నాడు నేడు పనులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసంతృప్తి
నాడు నేడు పనులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసంతృప్తి

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని పతంగే రామన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

నాణ్యంగా చేపట్టాలి..

కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ సంస్థ.. మండలంలోని 22 పాఠశాలల్లో నాడు-నేడు అభివృద్ధి పనులు చేపట్టింది. పతంగే రామన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, తరగతి గదులు.. తదితర పనులను పరిశీలించి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మరికొంత గడువు తీసుకుని నిర్మాణ పనులు నాణ్యంగా చేపట్టాలని సూచించారు.

ఇవీ చూడండి : లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన దురాగతం...పసితనంలోనే పసుపుతాడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details