రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని హర్షిస్తూ కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని నాలుగురోడ్ల కూడలి నుంచి వైయస్ఆర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలు వేసి నివాళులు అర్పించారు. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల ఏర్పాటు హర్షణీయం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి - ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వార్తలు
మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని హర్షిస్తూ కడప జిల్లా మైదుకూరులో వైకాపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు హర్షణీయం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి