విశాఖ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం కడపజిల్లా కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. విశాఖ ఘటన దురదృష్టకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ సంఘటనలో మృతిచెందిన కుటుంబాలకు వైకాపా తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి... మృతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా రూ.కోటి ప్రకటించడం గర్వించదగ్గ విషయం అన్నారు.
సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ క్షీరాభిషేకం
విశాఖ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించినందుకు సీఎం జగన్ చిత్రపటానికి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాలాభిషేకం చేశారు.
సీఎం జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ పాలాభిషేకం
Last Updated : May 9, 2020, 8:22 AM IST