ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిండి కరువైంది సారూ... స్వస్థలాలకు పంపించండి

By

Published : May 2, 2020, 5:57 PM IST

పొట్టకూటి కోసం వేల కిలోమీటర్లు దాటి రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక... ఉన్న ఇంటికి అద్దే కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఊళ్లకు వెళ్దామంటే ప్రజారవాణా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. కూలి పనుల కోసం కడపకు వచ్చి లాక్​డౌన్​తో చిక్కుకుపోయిన ఉత్తరప్రదేశ్​కు చెందిన వలస కూలీల దయనీయ పరిస్థితి ఇది.

స్వస్థలాలకు పంపించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వలస కూలీలు
స్వస్థలాలకు పంపించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వలస కూలీలు

కూలి పనుల కోసం వచ్చి లాక్​డౌన్​ వల్ల కడపలో చిక్కుకు పోయామని ఉత్తరప్రదేశ్​కు చెందిన వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 రోజుల నుంచి పనులు లేక ఖాళీగా ఉంటున్నామని వాపోయారు. తినేందుకు తిండి కూడా లేదని గోడు వెల్లబోసుకున్నారు. చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామంటూ... జిల్లా అధికారులు తమను ఉత్తరప్రదేశ్​కు తరలించాలని వేడుకుంటున్నారు. అధికారులు స్పందించాలని... లేదంటే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని కన్నీటిపర్యంతమయ్యారు. ఉన్న ఇంటికి అద్దెలు చెల్లించకపోవటంతో యజమానులు ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:సొంతూళ్లకు వలస కూలీలు

ABOUT THE AUTHOR

...view details