ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేట వైకాపా అభ్యర్థిగా మేడ మల్లికార్జున

వైకాపాలో మేడ మల్లికార్జున రెడ్డి చేరికతో, రాజంపేటం నుంచి వైకాపా అభ్యర్థిత్వం విషయంలో ఏర్పడిన సందిగ్ధత వీడింది. రాజంపేట అభ్యర్థిగా మేడ మల్లికార్జున రెడ్డికి టికెట్ ఖరారైంది.

By

Published : Feb 15, 2019, 11:23 PM IST

ఖరారైన రాజంపేట అభ్యర్థిత్వం

ఖరారైన రాజంపేట వైకాపా అభ్యర్థిత్వం
సీనియర్ నాయకుడిగా, రాజంపేట వైకాపాలో ఎంతో కాలంగా సేవచేస్తున్న అమర్ నాథ్ రెడ్డి, ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా వైకాపాలో మేడ మల్లికార్జున రెడ్డి చేరికతో, అమర్​నాథ్ రెడ్డి వర్గంలో తీవ్ర అంసతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ ఆదేశాల మేరకు, ఆ పార్టీ మాజీ ఎంపీ మేడ మిథున్ రెడ్డి సమక్షంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వ విప్​గా ఉంటూ వైకాపాలో చేరిన మేడ మల్లికార్జున రెడ్డి తొలిసారిగా ఆ పార్టీ సీనీయర్ నాయకుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఇరునేతల భేటీ అనంతరం రాజంపేట అభ్యర్థిత్వంపై సందిగ్ధత వీడింది. రానున్న ఎన్నికల్లో రాజంపేట నుంచి మేడ మల్లికార్జున్​ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిధున్ రెడ్డి కోరారు. పార్టీలో చేరిన కొత్తంవర్గంతో అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. జగన్​ను సీఎం చేయాలనే లక్ష్యంగా పనిచేయాలని, ఎక్కడ ఎవరి మధ్య మనస్పర్థలు లేవని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details