ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 8, 2021, 8:53 AM IST

Updated : May 8, 2021, 11:29 AM IST

ETV Bharat / state

భార్యను కిరాతకంగా చంపిన భర్త.. అనుమానమే కారణం!

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త... ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన కడప జిల్లా బద్వేలులోని సుందరయ్య కాలనీలో జరిగింది. నిందితుడు పోలీసు స్టేషన్​లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

husband killed wife at kadapa
husband killed wife at kadapa

కడప జిల్లా బద్వేలులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. కడప పట్టణం తిలక్​నగర్​కు చెందిన హరిమంజులకు ఏడు నెలల కిందట వివాహం జరిగింది. రెండు రోజుల కిందట బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీలో రెండు రోజుల కిందట సంసారం పెట్టారు.

ఇద్దరి మధ్య ఏం వివాదం జరిగిందో కానీ భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఉదయాన్నే కత్తితో పొడిచి.. పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కిరాతకంగా హత్య చేసిన భర్త హరిపై బద్వేలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Last Updated : May 8, 2021, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details