కడప జిల్లా పులివెందులలోని జీపుల స్టాండ్ వద్ద జరిగిన ఘర్షణలో చిన్న(48) అనే వ్యక్తి మరణించాడు. కొందరు వ్యక్తుల మధ్య 200 రూపాయల విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో బాబుల్ రెడ్డి అనే వ్యక్తి.. చిన్న అనే వ్యక్తిపై దాడి చేయటంతో మృతి చెందాడు. చిన్నకు గతంలో గుండె శస్త్రచికిత్స జరిగింది. గొడవ జరగటంతో గుండెపోటు వచ్చి ప్రాణాలు వదిలాడా.. లేక కొట్టడం వల్ల మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రూ.200 కోసం ఘర్షణ.. వ్యక్తి మృతి - Man died in Clash news
కడప జిల్లా పులివెందులలో 200 రూపాయల కోసం జరిగిన ఘర్షణలో ఓ నిండుప్రాణం పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి మృతి