ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదంలో కడప వాసి మృతి

By

Published : May 3, 2020, 12:57 PM IST

కడప జిల్లా రామాపురం మండలం కొండారెడ్డిగారి పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, స్కూటీని ఢీ కొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

man dead in road accident
రోడ్డు ప్రమాదంలో కడపవాసి మృతి

కడప జిల్లా రామాపురం మండలం కొండారెడ్డిగారి పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రాయచోటి వైపు నుంచి కడప వెళ్తున్న కారు... ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న షేక్ సౌత్ వలి (28) అనే వ్యక్తి.. తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

మృతుడు కడపలోని అశోక్ నగర్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details