కడప జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగనూరులో దారుణం జరిగింది. ముత్యాలపాడు వరాలు (35) అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. మృతుడు వరాలు జమ్మలమడుగు బీసీ కాలనీ వాసిగా పోలీసులు గుర్తించారు. వరాలు హత్యకు ఎస్సీ కాలనీకి చెందిన ఉపేంద్ర కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Murder: ప్రత్యర్థుల చేతిలో వ్యక్తి దారుణ హత్య - ప్రత్యర్థుల చేతిలో వ్యక్తి దారుణ హత్య వార్తలు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగనూరులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ముత్యాలపాడు వరాలు అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హత మార్చారు.
![Murder: ప్రత్యర్థుల చేతిలో వ్యక్తి దారుణ హత్య ప్రత్యర్థుల చేతిలో వ్యక్తి దారుణ హత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13456664-440-13456664-1635174593016.jpg)
ప్రత్యర్థుల చేతిలో వ్యక్తి దారుణ హత్య