ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్...13 బైక్​లు స్వాధీనం

ద్విచక్రవాహనాలను చాకచాక్యంగా చోరీ చేస్తున్న దొంగను కడప జిల్లా మైదకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 13 బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Nov 10, 2020, 4:40 PM IST

Maidakuru police have arrested a thief for stealing two-wheelers.
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్

కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న దొంగను కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్నాడు. ఏ ప్రదేశంలోనైనా హ్యాండిల్ లాక్ చేయని బైక్​లు కనిపిస్తే చాకచక్యంగా వాటిని ఎత్తుకెళ్లడం పనిగా పెట్టుకున్నాడని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇతని వద్ద నుంచి 8 లక్షల రూపాయల విలువ చేసే 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా వాహనాలు నిలిపే సమయంలో లాక్ వేయడం మరవవద్దని జిల్లా ఎస్పీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details