ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముద్దనూరులో లారీ బీభత్సం..

కడప జిల్లా ముద్దనూరులో లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

By

Published : Nov 12, 2020, 7:17 AM IST

lorry accident
వేగం అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

కడప జిల్లా ముద్దనూరులో సిమెంట్​ లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. గేర్​బాక్స్ ఊడిపోవటాన్ని గమనించుకోని డ్రైవర్ వాహనాన్ని అలాగే నడపటంతో ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ పట్టణం సమీపంలో ఉన్న రైల్వే గేట్లను ధ్వంసం చేస్తూ ఊరిలోకి ప్రవేశించింది. అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లి పోయింది. ఈ ఘటనలో డ్రైవర్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్రేన్​ల సహాయంతో లారీని బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details