ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: రాజంపేటలో రహదారుల అష్టదిగ్భంధనం

కడప జిల్లా రాజంపేట పురపాలకలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

By

Published : Mar 25, 2020, 11:56 AM IST

అష్టదిగ్బంధనమైన రాజంపేట రహదారులు
అష్టదిగ్బంధనమైన రాజంపేట రహదారులు

అష్టదిగ్బంధనమైన రాజంపేట రహదారులు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్..​ రాజంపేట పురపాలకలో కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడే రహదారులను అష్టదిగ్బంధనం చేశారు. పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం, బెంగళూరు, నెల్లూరు మార్గాలు మూసివేశారు. జాతీయ రహదారిపై పోలీసులు పహారా నిర్వహించారు. స్థానిక డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు రోడ్లపైకి ప్రజలు రాకుండా కట్టడి చేస్తున్నారు. నిత్యవసర వస్తువుల కొనుగోలుకు తప్ప ఎవరూ బయటికి రావొద్దని డీఎస్పీ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details