ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ కార్గో బస్సులో తెలంగాణ మద్యం రవాణా - కడప కార్గో బస్సులో మద్యం సీసాలు

కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపోకు చెందిన కార్గో బస్సులో 23 మద్యం సీసాలను శుక్రవారం రాత్రి విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్గో బస్సుకు చెందిన ముగ్గురు డ్రైవర్లతోపాటు పూల వ్యాపారికి ఇందులో భాగస్వామ్యమున్నట్లు తెలిపారు.

liquor bottles in kadapa rtc cargo bus
కడప డిపోకు చెందిన కార్గో బస్సులో మద్యం సీసాలు

By

Published : Aug 1, 2020, 10:08 AM IST

సరకులు రవాణా చేసే కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపోకు చెందిన కార్గో బస్సులో 23 మద్యం సీసాలను శుక్రవారం రాత్రి విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దువ్వూరు మండలం కానగూడూరు నుంచి హైదరాబాద్​కు పూల బస్తాలతో కార్గో బస్సు వెళ్లింది. బస్సు తిరిగొస్తున్న సమయంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద తనిఖీ చేసిన విజిలెన్స్‌ అధికారులు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కార్గో బస్సుకు చెందిన ముగ్గురు డ్రైవర్లతోపాటు పూల వ్యాపారికి ఇందులో భాగస్వామ్యమున్నట్లు కడప ఆర్టీసీ డీఎం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details