ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 2, 2021, 6:59 PM IST

ETV Bharat / state

మద్యం కోసం మందుబాబుల బారులు

కడప జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు గాలికొదిలేశారు. కేసులు అంతకంతకూ పెరుగుతున్నా... భౌతికదూరం, మాస్క్‌ వంటి వాటిని పట్టించుకోవట్లేదు. కమలాపురం మూడు రోడ్ల కూడలి వద్ద మద్యం కోసం మందుబాబులు ఎగబడ్డారు.

lines-in-front-of-wine-shops-in-kamalapuram
కమలాపురంలో మద్యం కోసం మందుబాబుల బారులు

కడప జిల్లా కమలాపురం మూడు రోడ్ల కూడలిలో ఉన్న మద్యం దుకాణం వద్ద మందుబాబులు బారులు తీరారు. జిల్లాలో కోరనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ మద్యం ప్రియులకు అవగాహన రావడం లేదు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు స్పందిచకుంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కమలాపురంలో మద్యం కోసం మందుబాబుల బారులు

ABOUT THE AUTHOR

...view details