ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 నెలల్లో మోదీ రిటైర్: కేఏ పాల్

రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులైనా.. ఏ ఒక్కరూ రాయలసీమను పట్టించుకోలేదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే.ఏ.పాల్ ఆరోపించారు.

By

Published : Feb 5, 2019, 5:37 PM IST

మీడియాతో కేఏ పాల్

మీడియాతో కేఏ పాల్
రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారు కానీ.. ఏ ఒక్కరూ రాయలసీమ బాగోగులు పట్టించుకోలేదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే.ఏ. పాల్ ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ కావడం మంచిదని ... మరో మూడు నెలల్లో నరేంద్ర మోదీ రిటైర్ అవుతారని చెప్పారు. చంద్రబాబు తన 7 లక్షల కోట్ల రూపాయలను దాచుకునేందుకు రాజకీయాల్లో ఉన్నారని ఆరోపించారు. ప్రజా శాంతి పార్టీకి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని పూర్తిచేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details