మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రపతికి వైకాపా లేఖలు అనంతపురంలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా యువజన విభాగం రాష్ట్రపతికి పోస్టు కార్డులు పంపే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు కన్నబాబు, శంకరనారాయణ ప్రారంభించారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా...ఆయన చిత్రపటానికి మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో తెదేపా నేతలు కొన్న భూముల ధరలు తగ్గుతాయనే... రాజధానిని అమరావతిలో కొనసాగించాలని చంద్రబాబు పట్టుబడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు.. వైకాపా విధానాలను స్వాగతిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: