ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ముఖ్యమంత్రి జగన్ మాటలకు చేతలకు పొంతన లేదు" - kadapa tdp secretary comments on ycp government

కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదని కడప తెదేపా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ విమర్శించారు. పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సీఎంపై కడప తెదేపా ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలు
సీఎంపై కడప తెదేపా ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలు

By

Published : Jul 30, 2020, 3:20 PM IST

సీఎంపై కడప తెదేపా ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్​పై కడప తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కోవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవంటూ విమర్శించారు. అరగంటకు బెడ్ ఇవ్వాలని సీఎం జగన్ చెపుతున్న మాటలకు పొంతన లేదని ఆరోపించారు. పలు చోట్ల బెడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వాబ్ పరీక్షలకు ఉదయం వెళ్లిన సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించటం లేదన్నారు. నాణ్యమైన భోజనం అందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా వైరస్ నివారణ కోసం తగు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవీ చదవండి

దగ్గరకు రాని బంధుగణం...పంచాయతీ కార్యదర్శి మానవత్వం

ABOUT THE AUTHOR

...view details