ఏపీ, కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురం సమీపంలో ఇనుప ఖనిజ తవ్వకాల లీజు, విక్రయాలకు టెండర్లు పిలిచిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ.. తాజాగా లీజు నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ లీజు కింద తవ్వి తీసిన ఖనిజాన్ని తొలి ప్రాధాన్యంగా కడపలో ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమకు ఇవ్వాలంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం హెచ్.సిద్ధాపురంలోని ఏపీఎండీసీకి గతంలో 25 హెక్టార్ల ఇనుప ఖనిజ లీజు కేటాయించారు. ఇందులో 40 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు అంచనా. దీనికి మైన్ డెవలపర్, ఆపరేటర్ కోసం గత నెల టెండర్లు పిలిచారు. ఇందులో అయిదు సంస్థలు బిడ్లు వేశాయి.
ఉత్పత్తి చేసిన ఖనిజంలో 75 శాతం