కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీల అనంతరం నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మైదుకూరు మండలం అన్నలూరు క్లస్టర్లోని శివపురం పంచాయతీకి తొలి నామినేషన్ దాఖలైంది.
బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 206 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 97 నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అనంతరాజపురం నుంచి వెంకటసుబ్బమ్మ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.