ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈయనెవరో గుర్తు పట్టారా? సైకిల్ పై ఎందుకు తిరిగారో తెలుసా? - cadapa dst cycling news

కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ సామాన్యుడిలా సైకిల్ పై నగరంలో తిరిగారు. లాక్ డౌన్ అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు. యూనిఫాంలో లేని కారణంగా.. ప్రజలెవరూ ఆయన్ను గుర్తుపట్టలేదు.

kadapa dst sp cyciling in city to visit   lockdown
kadapa dst sp cyciling in city to visit lockdown

By

Published : May 20, 2020, 8:35 AM IST

కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. వినూత్న ప్రయోగం చేశారు. స్వయంగా సైకిల్ పై ఒక్కరే.. పట్టణంలో సంచరించారు. లాక్ డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. ఎలాంటి బందోబస్తు లేకుండా తన నివాసం నుంచి సైకిల్ పై బయలుదేరి నగరంలోని అన్ని ప్రాంతాల్లో పరిశీలించారు.

నెహ్రూ పార్క్, వై జంక్షన్, అంబేద్కర్ కూడలి, ఆర్టీసీ బస్టాండ్, కోటిరెడ్డి కూడలి, పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఒక్కరే సైకిల్​పై సంచరించారు. యూనిఫామ్ లో లేని కారణంగా.. కడప నగర ప్రజలు చాలామంది ఎస్పీని గుర్తు పట్టలేకపోయారు.

ABOUT THE AUTHOR

...view details